11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వరంగల్ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కీర్తి తోరణాల సముదాయం ఖిలా వరంగల్ నందు 1000 మందితో 45 నిమిషాల పాటు అంతర్జాతీయంగా ఆమోదించిన కామన్ యోగ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా గౌరవనీయులైన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ కె సోమ్లా నాయక్ గారు మరియు ముఖ్య అతిథి శ్రీమతి సత్య శారద  వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, డాక్టర్ బి ప్రమీలాదేవి ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, శ్రీమతి సంధ్యారాణి అడిషనల్ కలెక్టర్ వరంగల్ గారు, డాక్టర్ సాంబశివరావు డిఎంహెచ్ఓ వరంగల్ గారు, 37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సువర్ణ సురేష్ గారు, 38వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఉమా దామోదర్ యాదవ్ గారు, 41 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పోషాల పద్మ స్వామి గారు, డాక్టర్ మైదాన్ రాజు జిల్లా ఆయుష్ నోడల్ ఆఫీసర్, డాక్టర్ రాజేందర్ జిల్లా డిప్యూటీ నోడల్ ఆఫీసర్, డాక్టర్ అమృతవల్లి జిల్లా యోగా నోడల్, ఆఫీసర్ జి రాజు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మరియు ఆర్కియాలజీ విభాగం నుండి  కిషోర్ రెడ్డి, నవీన్ సీఐ గారు మరియు ఆయుబ్ డిపిఆర్ఓ గారు, టీజీవో ప్రెసిడెంట్ రామ్ రెడ్డి గారు, టి జి ఓ సెక్రెటరీ ఫణి కుమార్ గారు, ఎమ్మార్వో నాగేశ్వరరావు గారు, ఎన్ఎస్ఎస్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన శ్రీ సోమలా నాయక్ గారు మరియు శ్రీమతి సత్యసారద జిల్లా కలెక్టర్ గారు యోగా యొక్క విశిష్టత మరియు దాని యొక్క ప్రాముఖ్యత దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ప్రజలందరూ తప్పకుండా ప్రతిరోజు ఈ యోగా ఆచరించాలని సూచించారు.డాక్టర్ అమృతవల్లి యోగ యోగ నోడల్ ఆఫీసర్ గారు 45 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగ ఆసనాలు చేయించడం జరిగింది.

Comments