పిల్లల్లో ఉన్న కళల్ని ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత... మాజీ ఎం పి పసునూరి దయాకర్ .


హన్మకొండ, జూన్, 02,తెలంగాణ అనుక్షణం:సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ మూడవ వార్షికోత్సవ సంబరాలు హనుమకొండ తనిష్క్ జువెల్లెర్స్  కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సందర్భంగా మాజీ ఎం పసునూరి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు... పిల్లల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల్లో చదువే కాకుండా ఇతర ఆసక్తులను, అభిరుచులను గమనించి వాటిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటారని .. ఇది తల్లిదండ్రుల బాధ్యత అని, తను ఎం పి కాకుండా ఒక ఆర్టీస్ట్ అని చిత్ర కళతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. అకాడమీ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ అకాడమీ ఏర్పాటు చేసి చిన్నారులకు తనకు నచ్చిన, వచ్చిన విద్యను పంచడం  అదృష్టం అని, చాలా మంది చిన్నారులు తమ అకాడమీ ద్వారా చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నారని, ప్రతి నెల ఒక పోటీ నిర్వహిస్తూ, బహుమతులు అందిస్తున్నానని, మూడు సార్లు వేసవి కాలం లో క్యాంప్ లు ఏర్పాటు చేసి పిల్లలను చిత్ర కళలో మెళకువలు నేర్పిస్తున్నానని ఇదే విధంగా చారిత్రక వరంగల్ లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటే ఎంతో మందికి ఉపయోగ పడుతుందని అన్నారు... ఈ కార్యక్రమం లో  ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 7 గురు ప్రముఖ ఆర్టిస్టులు గిరిధర్ అరసవల్లి, డా లింగరాజు, సుజాత వెంకట్, పావని, బీర శ్రీనివాస్, అబ్దుల్ రాయబోస్, జయశ్రీ ప్రభాకర్ లకు విజువల్ మాస్ట్రో అవార్డులను దయాకర్ చేతుల మీదుగా అందించారు... ఈ సందర్భంగా జై జవాన్ పేరుతో నిర్వహించిన 23 వ డ్రాయింగ్ పోటీలో దాదాపు 60 మంది చిన్నారులు పాల్గొన్నారు... పోటీ అనంతరం సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందించారు.. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి విజయ్ కుమార్ , చిత్రకారుడు చిప్పకుర్తి శ్రీనివాస్, విప్పనపల్లి రవి కుమార్ అడ్వకేట్, విద్యాంచల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరి నాథ రావు, హరి ప్రియ, సుధ, వినీల, తనిష్క్ మేనేజర్ రావణ వర్మ, సంజన, విరాట్ సాయి, రఘుపతి, రాజ్ కుమార్, లతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు... పిల్లల తో ఫాన్సీ డ్రెస్ షో నిర్వహించడం కొసమెరుపు...

Comments