గౌరవ డాక్టరేట్ అందుకున్న సాగంటి మంజుల

 
తెలంగాణ అనుక్షణం:జూన్ 28 శని సాయంత్రం నాంపల్లి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు (సురవరం ప్రతాప రెడ్డి) తెలుగు యూనివర్సిటీ లో  ఏషియన్ ఇంటర్నేషనల్  కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డిల్లీ .. మరియు ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ. డిల్లీ సంయుక్తంగా హనుమకొండ గోపాలపురానికి చెందిన, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సాగంటి మంజులకు గౌరవ డాక్టరేట్ అందించారు... ఆమె చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఒక మహిళగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా సమాజాన్ని కూడా తన కుటుంబం భావించి, సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలవడం .. అలాంటి మహిళకు డాక్టరేట్ ఇవ్వడం తమకు గర్వకారణం అని కార్యక్రమ నిర్వాహకులు అన్నారు.. కార్యక్రమంలో యూనివర్సిటీ బాధ్యులు, స్పూర్తి అకాడమీ అధ్యక్షుడు ఆకుల రమేష్, మల్లం రమేష్, సినీ ప్రముఖులు, వందే భారత్ చిత్రం యూనిట్   అతిధులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యా కళాశాల అధ్యాపకురాలిగా, కవయిత్రిగా, గాయకురాలిగా, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ గా, జర్నలిస్ట్ గా, సామాజిక వేత్తగా పలు రంగాల్లో రాణిస్తున్న మంజులకు డాక్టరేట్ రావడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల కవులు, చిత్రకళా రంగ ప్రముఖులు, సామాజిక సేవకులు హర్షం వ్యక్తం చేశారు...

Comments