హన్మకొండ,మే25,తెలంగాణ అనుక్షణం :
సాగంటి మంజులకు గౌరవ డాక్టరేట్.   హనుమకొండ గోపాలపురానికి చెందిన లెక్చరర్, చిత్రకారిణి, కవయిత్రి, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, సామాజిక వేత్త గా సేవలందిస్తున్న సాగంటి మంజుల జూన్ 28 వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్ లో గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు..ఆసియా  ఇంటర్నేషనల్ కల్చర్ యూనివర్సిటీ ( యూ ఎస్ ఏ) , ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ సామాజిక సేవలో మంజుల చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను అందించనున్నారు... ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ చిన్ననాటి నుండే సేవా దృక్పథం నాలో ఉండేది.ఆ ఆలోచన  నాతో పాటు పెరిగి నేను ఉంటున్న సమాజానికి  నా వంతు కర్తవ్యంగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశం తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను.. నేను చేసేది నా బాధ్యత అనుకున్నాను...కానీ నా సేవకు ఇలాంటి ప్రతిఫలం వస్తుంది అని ఊహించలేదు. గతం లో డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఏం. ఎడ్ టాపర్ గా గోల్డ్ మెడల్ అందుకోవడం ఒక మైలు రాయి ఐతే ఇప్పుడు డాక్టరేట్ అందుకోవడం మరో మైలు రాయిగా నా జీవితం లో నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.. అలాగే తనకు ఈ గౌరవ డాక్టరేట్ అందించనున్న యూనివర్సిటీ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు... ఆమెకు  డాక్టరేట్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న ప్రముఖులు, కవులు, ఆర్టిస్టులు, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

Comments